Header Banner

ఏపీలో ఆరు లైన్ల కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవే! ఈ రూట్‌ లోనే! 6 గంటల్లోనే వెళ్లొచ్చు!

  Tue Feb 04, 2025 08:36        Politics

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, బైపాస్‌లు, ఫ్లై ఓవర్లకు సంబంధించి పనులు వేగవంతం అయ్యాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సమీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం-రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచారు. మూడు రాష్ట్రాలు (ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌) మీదుగా ఆరు లైన్లుగా ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండల పరిధిలో రోడ్డు నిర్మాణం పూర్తి కాగా.. నేమ్ బోర్డులు, సైన్ బోర్డులు, సిగ్నల్‌ లైట్లు, సోలార్‌ లైట్లు, సీసీ కెమెరాల వంటి పనులు పూర్తయ్యాయి. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలో ఎక్కడా మనుషులు, పశువులు దాటకుండా ఉండేందుకు గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు.

 

అలాగే సబ్బవరం సమీపంలో చిన్నయ్యపాలెం దగ్గర అనకాపల్లి-ఆనందపురం నేషనల్ హైవేను కలుపుతూ సింగిల్‌ ట్రంపెట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం మినహా మిగిలిన పనులు కూడా పూర్తయ్యాయి. కేంద్రం ఐదేళ్ల క్రితం భారతమాల ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌‌లను కలుపుతూ ఆరు లైన్లుగా గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది. 2021లో ఈ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి డీపీఆర్‌, భూసేకరణ, టెండర్‌ ప్రక్రియలు పూర్తయ్యాయి. ఏడీబీ నిధులు దాదాపు రూ.20 వేల కోట్లతో నిర్మించే ఈ వే పనుల్ని మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేతో (రాజాపులోవ- రాయ్‌పూర్‌) సంబంధం లేకుండా కొత్తగా ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తున్నారు.

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ఎక్స్‌ప్రెస్ వే మొత్తం పొడవు 464 కిలోమీటర్లు కాగా.. ఎన్‌హెచ్‌-130 సీడీ నంబరు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 100 కిలోమీటర్లు కాగా.. నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఒడిశాలో 240 కిలోమీటర్లు 11 ప్యాకేజీలు.. ఛత్తీస్‌గఢ్‌లో 124 కిలోమీటర్లు మూడు ప్యాకేజీలుగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో సబ్బవరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ఆలూరు వరకు నాలుగు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయి. ఈ నాలుగు ప్యాకేజీలలో.. 'ఆలూరు-జక్కువ 1వ ప్యాకేజీ, జక్కువ-కొర్లాం 2వ ప్యాకేజీ, కొర్లాం-కంటకాపల్లి 3వ ప్యాకేజీ, కంటకాపల్లి-సబ్బవరం 4వ ప్యాకేజీ'గా విభజించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో సబ్బవరం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు సుమారు 20 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెబుతున్నారు. 

 

ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే 2024 చివరి నాటికి నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా.. అయితే కొన్ నికారణాల వల్ల ఏడాది ఆలస్యంగా 2025 డిసెంబరునాటికి పూర్తి అవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో సబ్బవరానికి ఏడు కిలోమీటర్లు దూరంలో గులివిందాడ- చీపురువలస దగ్గర టోల్‌ ప్లాజ్ ఏర్పాటు చేస్తున్నారు.‌ ఈ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం- రాయ్‌పూర్‌ మధ్య దూరం 130 కిలోమీటర్లు, ప్రయాణ సమయం ఆరు గంటలు తగ్గుతుందని చెబుతున్నారు. మరోవైపు సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకు సాగరమాల (పోర్టు కనెక్టివిటీ రోడ్డు) రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. రూ.950 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా.. నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రోడ్డు పూర్తి చేస్తే విశాఖలో భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP